YS Avinash Reddy - CBI: విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్.. రాత్రంతా అనుచరుల జాగారం
కడప ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి శ్రీలక్ష్మితో పాటు ఆయన అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అనుచరులు కూడా ఆస్పత్రి వద్దే రాత్రంగా జాగారం చేసినట్లు తెలుస్తోంది.
కర్నూలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి శ్రీలక్ష్మితో పాటు ఆయన అక్కడే ఉంటున్నారు. దీంతో ఆయన అనుచరులు కూడా ఆస్పత్రి వద్దే రాత్రంతా జాగారం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా నేతలు.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు తిండి, వసతి సౌకర్యాలు సమకూర్చారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఈనెల 19న తల్లి శ్రీలక్ష్మిని అవినాష్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.
సోమవారం ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆస్పత్రికి చేరుకున్న రెండు సీబీఐ బృందాల్లో ఒక బృందం రాత్రి కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయింది. మరో బృందం మాత్రం పోలీసు రెస్ట్హౌస్లో ఉంది. మరోవైపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తుది ఉత్తర్వులిచ్చేదాకా అరెస్టు చేయవద్దని.. ఈ మేరకు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..