వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం:20మంది మృతి

నార్త్‌ ఈజిప్టులోని ఓ వస్త్ర దుకాణాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 23 మందికి...

Updated : 12 Mar 2021 13:05 IST

మరో 23 మందికి గాయాలు..

కైరో: ఉత్తర ఈజిప్టు అల్‌ క్వాలిబియా పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 23 మంది గాయపడినట్లు అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. అల్‌ క్వాలిబియా పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. మరికొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని