వీసాల రద్దు జాతి వివక్షే..! చైనా
చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.
అమెరికా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
బీజింగ్: చైనాకు చెందిన దాదాపు వెయ్యిమందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దుచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చైనా స్పందించింది. చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది. దీనిపై ప్రతి స్పందించే హక్కు చైనాకు ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చైనా విద్యార్థులపై చర్యలు తీసుకుంటూ, అమెరికాలో వారిని అణచివేతకు గురిచేయడాన్ని వెంటనే ఆపాలని అన్నారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని ఝావో లిజియన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, చట్ట వ్యతిరేక వాణిజ్య పద్ధతులు, గూఢచర్యానికి చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇలా అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నందున, ఇప్పటివరకు దాదాపు వెయ్యిమంది విద్యార్థుల, పరిశోధకుల వీసాలను రద్దుచేసినట్లు అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుపై మండిపడిన చైనా, విద్యార్థులపై కక్షసాధింపు చర్యలు ఆపాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్