దేశంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సాధ్యం కాదు!
అధిక జనాభా కలిగిన దేశంలో సాధరణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని......
ఇమ్యూనైజేషన్తోనే సాధ్యమన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని వెల్లడి
దిల్లీ: అధిక జనాభా కలిగిన దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈవైరస్ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దేశంలో కరోనా వైరస్ తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీ రేటు 64.4శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ నెలలో 7.85 శాతంగా ఉన్న ఈ రేటు ప్రస్తుతం 64 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 10లక్షల మంది కోలుకున్నారని స్పష్టం చేసింది. వైద్యులు, నర్సులతోపాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగానే బాధితులు ఈ స్థాయిలో కోలుకుంటున్నట్లు అభిప్రాయపడింది.
16 రాష్ట్రాల్లో ఎక్కువ రికవరీ..
ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకునే వారి శాతం జాతీయసగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. అత్యధిక రికవరీ రేటు దిల్లీలో 88 శాతం ఉండగా, లద్దాఖ్లో 80%, హరియాణా 78%, అసోం 76%, తెలంగాణ 74%, తమిళనాడు, గుజరాత్లలో 73%, రాజస్థాన్ 70%, మధ్యప్రదేశ్ 69%, గోవాలో 68% మంది కోలుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోటీ 81లక్షల కొవిడ్ పరీక్షలు..
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు కోటీ 81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. నిత్యం జరిపే కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రతి పదిలక్షల జనాభాకు 324 టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మూడో దశలో 3 వ్యాక్సిన్లు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల రూపకల్పనలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. వీటిలో అమెరికా, యూకే, చైనా దేశాల వ్యాక్సిన్లు మూడో దశలో ఉన్నాయి. ఇక భారత్లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు ఫేజ్-1, ఫేజ్-2 దశల్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటి వ్యాక్సిన్ను 8 ప్రదేశాల్లో దాదాపు 1150 మందిపై ప్రయోగిస్తుండగా, రెండో వ్యాక్సిన్ను ఐదు ప్రదేశాల్లో వెయ్యి మందిపై ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం దాన్ని ఎవరికి, ఎలా ఇవ్వాలనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
2.21 శాతానికి తగ్గిన మరణాల రేటు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు భారత్లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రపంచ సగటు 4శాతం ఉండగా భారత్లో 2.21శాతంగా ఉన్నట్లు తెలిపింది.
అత్యధిక మరణాల రేటు ఉన్న దేశాలు..
దేశం మరణాల రేటు(శాతంలో)
యూకే 15.3
మెక్సికో 11.1
ఇరాన్ 5.5
బ్రెజిల్ 3.6
అమెరికా 3.5
భారత్ 2.21
రష్యా 1.6
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..