యూజీసీ ఆదేశాలపై యూనివర్సిటీల స్పందన

విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఈనెల 6న విధి విధానాలు జారీ చేసిన విషయం ...

Published : 18 Jul 2020 10:26 IST

దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఈనెల 6న విధి విధానాలు జారీ చేసిన విషయం తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలపై దేశంలోని 755 యూనివర్సిటీలు స్పందించాయి. వీటిలో 120 డీమ్డ్‌, 274 ప్రైవేటు, 40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాయి. పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు కూడా త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. 2019-20 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన 27 కొత్త యూనివర్సిటీలు తొలి బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వివరాలు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని