Tower: ప్రియుడిపై కోపం.. 80 అడుగుల హైటెన్షన్‌ విద్యుత్‌ టవరెక్కిన బాలిక!

ఒక బాలిక ప్రియుడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల విద్యుత్‌ టవర్‌ పైకి ఎక్కేసింది. దీంతో ప్రియుడు కూడా ఆమెను బతిమాలేందుకు ఆ టవర్‌పైకి ఎక్కాల్సి వచ్చింది. 

Published : 07 Aug 2023 11:04 IST

రాయ్‌పూర్‌: ప్రేమికుల మధ్య గొడవ జరిగితే.. మాట్లాడుకోకపోవడం, కొన్నాళ్లు దూరంగా ఉండడం, బతిమాలించుకోవడం చేస్తుంటారు. కానీ ఒక బాలిక ప్రియుడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల విద్యుత్‌ టవర్‌ ఎక్కేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ ( Chhattisgarh)లోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

అయోధ్య ఆలయం కోసం 400 కిలోల తాళం

గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో అతడితో ఫోన్లో గొడవ పడింది. దీంతో ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తున్న హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ పైకి ఎక్కింది. ఆమెను బుజ్జగించేందుకు అతడు కూడా టవర్‌ పైకి ఎక్కాల్సి వచ్చింది. స్థానికులంతా టవర్‌ చుట్టూ చేరి వారిని కిందకి దిగమని ప్రాధేయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంత నచ్చజెప్పినా వారు మాత్రం కిందకు దిగలేదు. కొన్ని గంటల తర్వాత సురక్షితంగా కిందకు దిగారు. మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడవద్దని పోలీసులు వారిని మందలించి వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని