చండీగఢ్ మేయర్ ఎన్నికపై సంచలన తీర్పు.. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీం
Chandigarh mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది.
దిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు.. ఆ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది.(Chandigarh mayoral Poll)
జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా భాజపా మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్, ఆప్లు ఆరోపించాయి. ఆప్ కౌన్సిలర్ వేసిన పిటిషన్ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..?’ అంటూ మసీహ్ను ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు ’ అని వెల్లడించిన సీజేఐ.. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరోసారి వీక్షించారు.
చమత్కరించిన సీజేఐ..
మాసిహ్ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ.. లెక్కింపు వీడియోను మరోసారి ప్లే చేయమన్నారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్ వీడియో మొత్తం వేయాల్సిన పనిలేదు. అంతా వేస్తే.. సాయంత్రం 5.45 గంటల వరకు ఇక్కడే ఉంటాం’ అని సరదాగా మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
-
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!