అక్కడ పరీక్షలు జరిగితే.. ఇంటర్నెట్ సేవలు బంద్!
ఇంటర్నెట్ డెస్క్: అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ ఘటనలకు సంబంధించిన అంశాలు ఇతర ప్రాంతాలకు చేరకూడదని ఇలా చేస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని కొన్ని దేశాలు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నాయి. ఎందుకంటారా? అక్కడ ఎక్కువగా పరీక్ష పత్రాలు లీక్ కావడం, పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారట. వీటిని అరికట్టడం కోసం.. ఏకంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నారు.
సూడాన్లో ప్రస్తుతం డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సూడాన్లో పరీక్షలు నిర్వహించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పరీక్ష పత్రాలు పంపిణీ చేసిన వెంటనే వాటిని కొందరు విద్యార్థులు సోషల్మీడియాలో పోస్టు చేయడం, ఇంటర్నెట్లో సమాధానాలు వెతికి రాయడం చేస్తున్నారట. దీంతో విద్యార్థుల చేసే చీటింగ్ను అరికట్టేందుకు పరీక్షల సమయంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఇప్పటి నిర్ణయం కాదు.. గత కొన్నేళ్లుగా సూడాన్లో పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నారు. ఎక్కువగా పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు జరుగుతాయి. ఆ సమయంలోనే దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.
ఆఫ్రికాలోని మరో దేశం అల్జీరియాలోనూ తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఆరు లక్షల మంది అభ్యర్థులు ఉన్నత చదువుల కోసం ఈ పరీక్ష రాశారు. జూన్లోనే జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా గత ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేయకుండా ఉండేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా సోషల్మీడియాతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇరాక్ వంటి మరి కొన్ని దేశాల్లోనూ ఇలా పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
General News
Agnipath: విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు
-
India News
Euthanasia: కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు
-
Technology News
Instagram: ఇన్స్టాగ్రామ్లో యూజర్ డేటా ట్రాకింగ్.. నిజమెంత?
-
Movies News
Hello World Review: హలో వరల్డ్ రివ్యూ
-
India News
Noida Twin Towers: ట్విన్ టవర్ల కూల్చివేత మరోసారి పొడిగింపు.. కారణమిదే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Rishabh Pant: రిషభ్ పంత్కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య