మర్యాదపూర్వకంగా కూడా చెప్పరా..!
కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తనకు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాక తెలిసిందని రాష్ట్ర గవర్నర్ మొహ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ వేసే ముందు కనీసం గవర్నర్కు మర్యాద
సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై ఆగ్రహించిన గవర్నర్
కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తనకు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాక తెలిసిందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ వేసే ముందు కనీసం గవర్నర్కు మర్యాద పూర్వకంగానైనా తెలియజేయాల్సివుందని ఆయన హితవు పలికారు. సీఏఏపై కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ గురించి మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
‘కేరళ ప్రభుత్వం పిటిషన్ వేయడాన్ని నేను తప్పుబట్టడం లేదు. వాళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఉంది. కానీ గవర్నరైన నా దగ్గర ముందస్తు అనుమతి తీసుకోలేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా నాకు తెలియజేయలేదు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తాననని ఆయన తెలిపారు. ‘రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న నేను సీఏఏపై కేరళ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయాన్ని వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ ద్వారా తెలుసుకున్నాను’ అని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్