చూడలేకపోతే అది వారి సమస్య
భారత దేశం ముస్లిములకు స్వర్గ సమానమైనదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
భారత్ ముస్లిములకు స్వర్గం లాంటిది: కేంద్ర మంత్రి నఖ్వీ
దిల్లీ: భారత దేశం ముస్లిములకు స్వర్గ సమానమైనదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. దేశంలో ముస్లిములంటే భయపడే ఇస్లామోఫోబియా ఉందన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓఐసీ) విమర్శలకు జవాబుగా ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్లో ముస్లిముల సాంఘిక, ఆర్థిక, మతపరమైన హక్కులకు ఏ విధమైన భంగం వాటిల్లలేదని నఖ్వీ స్పష్టం చేశారు. భారత్లో ముస్లింల హక్కులను కాపాడి, వారిని ఇస్లామోఫోబియా నుంచి రక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓఐసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా దేశంలో మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, వారిపై వివక్ష చూపుతోందని కూడా ఈ సంస్థ ఆరోపించింది.
ఇందుకు మంత్రి స్పందిస్తూ తాము తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నామని... ప్రధాని ఎప్పుడు మాట్లాడినా దేశంలోని 130 కోట్లమంది భారతీయుల సంక్షేమాన్ని గురించి మాట్లాడుతారని... దానిని ఎవరైనా చూడలేకపోతే అది వారి సమస్య అని సమాధానమిచ్చారు. ‘‘భారత్లో ముస్లింలు సుసంపన్నంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారు వారికి (ముస్లిములకు) మిత్రులు కారు.’’అని నఖ్వీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!