న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయలేరు
న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయజాలరని, కొలీజియం విషయంలో మరో ఆలోచనకు, చర్చలకు తావే లేదని మాజీ బ్యూరోక్రాట్లు స్పష్టం చేశారు.
రిజిజు వ్యాఖ్యలపై మాజీ బ్యూరోక్రాట్ల బహిరంగ లేఖ
దిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయజాలరని, కొలీజియం విషయంలో మరో ఆలోచనకు, చర్చలకు తావే లేదని మాజీ బ్యూరోక్రాట్లు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా పదేపదే కొలీజియం తీరును తప్పుబట్టడం, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడి చేయడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తగదని హితవు పలికారు. ఈ మేరకు 90 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఆయనకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో గురువారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో దిల్లీ మాజీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతా రావు తదితరులున్నారు. కొంత మంది పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను భారత వ్యతిరేక శక్తులని ఆరోపించడం తగదని వారు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించడంద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఎవరి అభిప్రాయాలపైనైనా అభ్యంతరాలుంటే న్యాయ మంత్రిగా మీకున్న అవకాశాలను ఉపయోగించుకుని సరైన వేదికలపై మాట్లాడవచ్చని, చర్చలు జరపవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్