India Or Bharat: మెలూహా నుంచి ఇండియా దాకా!
అమృతోత్సవవేళ దేశం పేరును ఇకపై భారత్గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్లు వెనకున్న చరిత్ర చూడటం సందర్భోచితం! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరం.
భారతావని నామ్నీకరణాలు
అమృతోత్సవవేళ దేశం పేరును ఇకపై భారత్గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్లు వెనకున్న చరిత్ర చూడటం సందర్భోచితం! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరం. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీప, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి మెసపటోమియా నాగరికత కాలంలో లభించిన రాతల్లో సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహాగా పేర్కొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. రాజకీయ చరిత్రలో దీనికి పెద్ద ప్రాధాన్యం లభించలేదు. భరతవర్ష, భారత్ మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి.
(షర్టు మీద ‘ఇండియా’ అని ఉండేది. నేను ఈ దేశం వాణ్ని కాదనుకుంటారేమోనని కత్తిరించేశా సార్..!)
పర్షియన్లతో హిందుస్థాన్
పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు- సంస్కృతంలోని సింధు (నది)ను హిందుగా పలికారు. క్రీస్తుశకం ఆరంభంలో దీనికి పర్షియన్ పదం ‘స్థాన్’ తోడై హిందుస్థాన్గా మారింది. పర్షియన్ల హింద్ కాస్తా గ్రీకుల నోళ్లలో ఇండస్గా మారింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో అలెగ్జాండర్ భారత్పై దండెత్తి ఇండస్ (సింధూనది) తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తులు భారత్ పేరును హిందుస్థాన్గానే ప్రాచుర్యంలో ఉంచారు. ఆసియాలోని అనేక దేశాల్లో ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ పేరుతోనే పిలిచేవారు. 18వ శతాబ్దం చివరి దాకా ఇదే పేరుండేది.
బ్రిటిష్ వారితో ఇండియా
భారత ఉపఖండం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత హిందుస్థాన్ పేరు మాయమై ఇండియా పేరు స్థిరపడింది. స్థానిక పేర్లు, సంప్రదాయాలు, చదువులను తమవాటితో నింపేయాలని చూసిన ఆంగ్లేయులు ఇండియా పేరును పటాల్లో, అధికారిక పేర్లలో ఖాయం చేశారు. సర్వే ఆఫ్ ఇండియాలాంటి సంస్థలనూ ఇండియా పేరుతో స్థాపించారు. బ్రిటిష్ వలస పాలన పోయి, స్వాతంత్య్రం వచ్చాక దేశం పేరుపై వాదోపవాదాలు మొదలయ్యాయి. రాజ్యాంగ రచన సమయంలో దీనిపై తీవ్ర చర్చోపచర్చ జరిగింది. ఇండియా అనే ఉంచాలని కొంతమంది డిమాండ్ చేయగా, విదేశీయులు పెట్టిన పేరు బదులు మనకున్న పురాతన భారత్ అని పిలుచుకుందామని మరికొందరు వాదించారు. హిందుస్థాన్ అని పెడదామని సూచించిన వారూ ఉన్నారు. చివరకు ఎవరినీ నొప్పించక తానొవ్వక ఇండియా, భారత్ పేర్లను ఉంచేశారు. అలా సద్దుమణిగినా అడపాదడపా దేశం పేరును భారత్గా మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. 2012లో కాంగ్రెస్ సభ్యుడు శాంతారాం నాయక్ పార్లమెంటులో దేశం పేరును భారత్ అని మార్చాలంటూ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. మనం భారత్ మాతాకీ జై అంటామే తప్ప, ఇండియాకీ జై అనం కదా అంటూ వాదించారు. 2014లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంపీగా ఇలాంటి డిమాండ్తోనే ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దేశం పేరు భారత్గా మార్చాలని సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు వేశారు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని, కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఇటీవలే స్పష్టంచేసింది. ఇప్పుడు ఇండియా పేరుతో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ఆహ్వాన పత్రికలో తీసుకువచ్చిన ప్రస్తావన సరికొత్త చర్చకు తెరతీసింది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!