యూజీసీ నెట్‌ తేదీలో మార్పు

యూజీసీ నెట్‌ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్‌ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్‌ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.

Updated : 30 Apr 2024 07:06 IST

జూన్‌ 18న నిర్వహించనున్నట్లు ప్రకటన

దిల్లీ: యూజీసీ నెట్‌ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్‌ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్‌ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే అదే రోజు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని యూజీసీ నెట్‌ నిర్వహణ తేదీని మార్చాలని నిర్ణయించినట్లు జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని