ఏడేళ్లలో 157 వైద్య కళాశాలలకు అనుమతులు

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 157 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులిచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది

Published : 25 Oct 2021 04:54 IST

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 157 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులిచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టులపై రూ.17,691 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కళాశాలలన్నీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే దాదాపు 16 వేల అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని