రెండుకాళ్లకు మేకులు దింపి.. చనిపోయాడని వదిలేసి..

ఆర్‌టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక.. రెండు కాళ్లకు మేకులు దింపి, చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన క్రూరమైన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. మద్యం మాఫియాపై ఫిర్యాదు ...

Updated : 24 Dec 2021 07:13 IST

బాడ్‌మేడ్‌: ఆర్‌టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక.. రెండు కాళ్లకు మేకులు దింపి, చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన క్రూరమైన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసినందుకే మాజీ సర్పంచ్‌ ఈ దాడి చేయించారని బాడ్‌మేడ్‌ జిల్లాకు చెందిన సహ చట్టం కార్యకర్త అమరా రామ్‌ గోదారా ఆరోపించారు. గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయన్ని గ్రామస్థులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆర్‌టీఐ కార్యకర్తపై దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని