KL Rahul - Shami: అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్కు (KL Rahul) భారత స్టార్ పేసర్ షమీ మద్దతుగా నిలిచాడు. హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాచైంజీ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఒక కెప్టెన్తో అలా కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన షమీ.. ప్రతి క్రికెటర్కు ఆత్మ గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించాడు.
‘‘మీరు ఓనర్. ఎంతో మర్యాదస్తులు. అదే సమయంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలి. చాలామంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి వాటిని మైదానంలో కెమెరా ముందు కాకుండా.. డ్రెస్సింగ్ రూమ్ లేదా సమావేశాల్లో మాట్లాడి ఉంటే బాగుండేది. ఇది చాలా అవమానకరం. ఎందుకంటే అతడు ఒక కెప్టెన్. సాధారణ ప్లేయర్ కూడా కాదు. క్రికెట్ అంటేనే టీమ్ గేమ్. ప్రణాళికలు ఒక్కోసారి సక్సెస్ కావు. మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రతి ఆటగాడికి గౌరవం ఇవ్వాలి. మాట్లాడేందుకు ఓ విధానం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది’’ అని షమీ వ్యాఖ్యానించాడు.
కేఎల్ రాహుల్ మెరుగుపడాలి: ముంబయి మాజీ ఆటగాడు
‘‘టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా కేఎల్ రాహుల్ మారాలి. ఇప్పుడు పొట్టి కప్ కోసం ఎంపిక కాకపోవడం కూడా అతడికి హెచ్చరికలాంటిదే. భారత్ తరఫున భవిష్యత్తులో ఆడాలనకుంటే తన శైలిని మార్చుకోవాలి. గతంలోనూ కేఎల్కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. త్వరగానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ కొన్ని రోజులుపాటు ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడైతే ఫామ్ను అందుకొని భారీగా పరుగులు చేశాడో.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదేవిధంగా కేఎల్ కూడా రాణించాలి. ద్రవిడ్, రోహిత్ నుంచి అతడికేమీ ముప్పు ఉండదని భావిస్తున్నా. ఉత్తమంగా ఆడితే జట్టు నుంచి తప్పించేందుకు వారు మొగ్గు చూపరు. తప్పకుండా కేఎల్ పుంజుకుంటాడని అనుకుంటున్నా’’ అని ముంబయి మాజీ ఆటగాడు మిచెల్ మెక్క్లెనాఘన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!