ఇష్టం లేని శృంగారాన్ని మహిళ నిరాకరించొచ్చు
వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది! పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా
ఆమెకు ఆ హక్కు ఉంటుంది
దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది! పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి.హరిశంకర్ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లయినంత మాత్రాన.. భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా- మహిళ కేవలం ఇతర సివిల్, క్రిమినల్ చట్టాలనే ఆశ్రయించాలా? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)- 375 (అత్యాచారం) సెక్షన్ ఆ కేసులో వర్తించదా? ఇది సరికాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా అని ప్రశ్నించింది. ఐపీసీ-375 సెక్షన్ పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని అధికరణం-14, అధికరణం-21లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మాసనానికి ఉందని పేర్కొంది. 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తుచేసింది. దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. దీంతో జస్టిస్ శక్ధేర్ కలుగజేసుకొని.. ‘‘ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనుకోండి. అయినప్పటికీ బలవంతంగా ఆయన లైంగిక చర్యకు పాల్పడ్డారనుకోండి. అది నేరం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘అది నేరమే. కానీ అత్యాచార చట్టం పరిధిలోకి రాదు’’ అని నందిత బదులిచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సహజీవనం చేసేవారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో రాదు. ఎందుకు? సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్