
Updated : 17 Jan 2022 06:24 IST
తట్టు టీకా వికటించిముగ్గురు చిన్నారుల మృతి
కర్ణాటకలో ఘటన
బెళగావి, న్యూస్టుడే: కర్ణాటకలోని బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రుబెల్లా టీకా వేశారు. వెంటనే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. పరిస్థితి విషమించడంతో పవిత్రా హులగూర (13 నెలలు), మధు కరగుంది (14 నెలలు), చేతన్ పూజారి (15 నెలలు) కన్నుమూశారు. మరో చిన్నారి ఆరోగ్యం కూడా విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
Tags :