ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వేడుకకు 7 వేల మంది వీక్షకులు రానుండగా, 10 వేల మంది పోలీసులతో బహుళ అంచెల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంద్రాగస్టు వేడుకలు
10వేల మంది పోలీసులతో రక్షణ
స్వాతంత్య్ర వేడుకలకు 7 వేల మంది వీక్షకులు
దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వేడుకకు 7 వేల మంది వీక్షకులు రానుండగా, 10 వేల మంది పోలీసులతో బహుళ అంచెల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంద్రాగస్టు వేడుకలు ముగిసేవరకూ ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్గా ప్రకటించారు. పతంగులు, డ్రోన్లు, చైనీస్ లాంతర్ల ఎగురవేతపై నిషేధం విధించారు. పారాగ్లైడర్లు, హాంగ్ గ్లైడర్లు, ఎయిర్ బెలూన్లు తదితరాల సంచారంపై జులై 22న విధించిన నిషేధాజ్ఞలు ఆగస్టు 16 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. డీఆర్డీవో, ఇతర రక్షణ విభాగాలు రూపొందించిన యాంటీ డ్రోన్, రాడార్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. సున్నిత ప్రాంతాల్లో 400 మంది కైట్ క్యాచర్స్ను నియమించారు. ఎర్రకోట ప్రాంగణ ప్రవేశద్వారం వద్ద ముఖ గుర్తింపు కెమెరాలు (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్-ఎఫ్ఆర్ఎస్) అమర్చారు. అత్యంత నాణ్యత గల సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షించనున్నట్లు దిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు. మరోపక్క, దిల్లీలోని ఆనంద్విహార్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 2వేలకుపైగా తూటాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విధ్వంసక చర్యలను అరికట్టేందుకు పోలీసులు దేశ రాజధాని వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు