అవినీతి నిరోధక ఉద్యోగులకు సీవీసీ సత్కారం

కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులను సత్కరించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌

Published : 17 Aug 2022 05:51 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులను సత్కరించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) నిర్ణయించింది. ‘విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ నేపథ్యంలో ఈ నామినేషన్లను ఆహ్వానించారు. విధుల నిర్వహణలో ఇతర ఉద్యోగులూ అప్రమత్తంగా ఉండేలా ప్రేరణ కల్పించేందుగ్గాను ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది కాలంలో అన్ని విభాగాల్లో అవినీతిని అడ్డుకునేందుకు అధికారులు, ఉద్యోగులు చేపట్టిన నిర్దిష్ట చర్యలను గుర్తించాలని ముఖ్య నిఘా అధికారులందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి అధికారులు, సిబ్బంది పేర్లను ఆయా సంస్థల సీఈవోల ఆమోదంతో తమకు పంపాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని