వంతెన ‘అడ్డు’తొలగించారు
తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక పాత వంతెనను అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చేశారు. ఈ వంతెనను 90వ దశకం ప్రారంభంలో నిర్మించారు.
పుణెలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూల్చివేత
600 కేజీల పేలుడు పదార్థాల వినియోగం
పుణె: తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక పాత వంతెనను అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చేశారు. ఈ వంతెనను 90వ దశకం ప్రారంభంలో నిర్మించారు. ముంబయి-బెంగళూరు జాతీయ రహాదారిపై చాందినీ చౌక్ వద్ద ఉన్న దీనిని కూల్చివేసేందుకు సుమారు 600 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత సమయంలో వాహనాలను వేరే మార్గంలో పంపారు. కూల్చివేత అనంతరం శిథిలాలను తొలగించి ఉదయం 10 గంటల సమయంలో వాహనాలను అనుమతించారు. ఇటీవల నొయిడాలో ట్విన్ టవర్స్ను కూల్చివేసిన ఎడిఫిస్ సంస్థే పుణెలోనూ వంతెన కూల్చివేత పనులు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?