
Modi Nepal visit: భారత్-నేపాల్ స్నేహం మానవాళికి ప్రయోజనకరం: మోదీ
ఇరు దేశాల మధ్య ఆరు అవగాహన ఒప్పందాలు
కాఠ్మాండూ: భారత్-నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. బుద్ధుడి పట్ల ఆరాధన ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తూ ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు. బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉందన్న మోదీ.. ఇది విభిన్న అనుభూతిని పంచుతోందన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందని పేర్కొన్నారు.
‘బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. ఆయన అందరివాడు. రాముడికి సైతం నేపాల్తో బంధం ఉంది. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. ఒకే కుటుంబంగా మార్చుతున్నాడు. ఇరుదేశాల సంబంధాలను నేపాల్లోని ఎత్తయిన పర్వతాల స్థాయికి చేర్చాలి. పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలి’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఒకరోజు పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నేపాల్కు వెళ్లారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ్బా, మోదీ లుంబినిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్సిటీ, త్రిభువన్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి వివిధ ఒప్పందాలు జరిగాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా