19,299 రికవరీలు.. 18,645 కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 8,43,307 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,645 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,50,284కి చేరింది. ఇక కొత్తగా 19,299 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో...........

Published : 10 Jan 2021 10:39 IST

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో 8,43,307 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,645 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,50,284కి చేరింది. ఇక కొత్తగా 19,299 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,00,75,950కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.42 శాతానికి పెరిగింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 201 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,50,999కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,23,335కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ.. తొలినాళ్లతో పోలిస్తే రోజురోజుకీ కేసుల సంఖ్య తగ్గుతుండడం ఊరటనిస్తోంది. మరోవైపు బ్రిటన్‌ రకం కరోనా కేసులు శనివారం నాటికి 90కి చేరాయి.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్‌ సన్నద్ధతలపై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయిలో నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రాబోతున్న పండుగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించాలని దీనిలో ఖరారు చేశారు.

ఇవీ చదవండి..

16 నుంచి టీకా

తొలిరోజు 139 కేంద్రాల్లో  టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని