Israel-Hamas: 4.30 గంటలు డోర్ పట్టుకునే ఉన్నాం: హమాస్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కేరళ మహిళ
Israel-Hamas: ఇజ్రాయెల్లో హమాస్ దాడిని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు ఇద్దరు కేరళ మహిళలు. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు నాలుగున్నర గంటలు డోర్ను గట్టిగా పట్టుకున్నామని నాటి భయానక పరిస్థితిని వివరించారో మహిళ.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ (Kerala)కు చెందిన సబిత, మీరా మోహన్ ఇజ్రాయెల్ (Israel)లో కేర్గివర్లు (Caregivers)గా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా (Gaza) సరిహద్దుల్లోని నీర్ ఓజ్ అనే కిబుట్జ్లోకి హమాస్ (Hamas) మిలిటెంట్లు చొరబడి నరమేధానికి పాల్పడిన సమయంలో వారు అక్కడే విధి నిర్వహణలో ఉన్నారు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి వారు ఓ వృద్ధురాలిని హమాస్ దాడి నుంచి కాపాడగలిగారు. వారి ధైర్యాన్ని అభినందిస్తూ భారత్లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israel Embassy in India) తాజాగా తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆనాడు వారు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని సబిత ఆ వీడియోలో గుర్తుచేసుకున్నారు. అది ఆమె మాటల్లోనే..
‘‘ఈ సరిహద్దు ప్రాంతంలో నేను మూడేళ్లుగా పనిచేస్తున్నా. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న రహేల్కు నేను, మీరా మోహన్ కేర్గివర్లుగా ఉన్నాం. ఆ రోజు (అక్టోబరు 7) నేను నైట్ డ్యూటీలో ఉన్నా. ఉదయం 6.30 గంటలకు వెళ్లిపోవాల్సింది. సరిగ్గా అదే సమయంలో మాకు సైరన్లు వినిపించాయి. వెంటనే రహేల్ను తీసుకుని మేం సేఫ్టీ గదుల్లోకి పరిగెత్తాం. సైరన్ల మోత ఆగట్లేదు. బయట ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు రహేల్ కుమార్తె మాకు ఫోన్ చేసి.. ‘పరిస్థితి చేయి దాటిపోయింది. ముందు, వెనుక డోర్లు లాక్ చేసుకోండి’ అని చెప్పారు’’
‘‘వెంటనే మేం తలుపులు లాక్ చేసుకున్నాం. ఉదయం 7.30 గంటల సమయంలో ఉగ్రవాదులు మా ఇంట్లోకి చొరబడ్డారు. మేము ఉన్న గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ రహేల్ కుమార్తెకు ఫోన్ చేశాం. ‘డోర్ను గట్టిగా పట్టుకోండి. వదిలిపెట్టొద్దు’ అని ఆమె చెప్పారు. మేం అలాగే చేశాం. గ్రిప్ పోకుండా ఉండేందుకు చెప్పులను కూడా తీసేశాం. బయటి నుంచి ఉగ్రవాదులు మా గది తలుపు బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తుపాకీతో కాల్పులు కూడా జరిపారు’’
గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్ర చర్యే: నెతన్యాహు
‘‘దాదాపు నాలుగున్నర గంటల పాటు మేం ఆ డోర్ను గట్టిగా పట్టుకునే ఉన్నాం. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మళ్లీ కాల్పుల చప్పుడు వినిపించింది. అప్పుడు షెములిక్ (ఆ ఇంటి యజమాని) వచ్చి.. ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని చెప్పారు. ఆయన బయటికెళ్లి చూసే సరికి అంతా ధ్వంసమై కన్పించింది. మా ఇంట్లో ఉగ్రవాదులు అన్ని దోచుకెళ్లారు. మీరా పాస్పోర్ట్, నా ఎమర్జెన్సీ బ్యాగ్ను కూడా తీసుకెళ్లారు’’
‘‘సాధారణంగా సరిహద్దుల్లో ఉండే మాకు క్షిపణులు పడినప్పుడు సేఫ్టీ గదుల్లోకి వెళ్లి.. పరిస్థితులు సద్దుమణిగాక బయటకు రావడం అలవాటే. అప్పుడు మా ఎమర్జెన్సీ బ్యాగులు తీసుకుని వెళ్తాం. అందులో మా డాక్యుమెంట్లన్నీ ఉంటాయి. కానీ, ఇలాంటి ఉగ్రదాడిని మేం ఊహించలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది’’ అని సబిత ఆ వీడియోలో నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోతో పాటు హమాస్ తూటాలు దిగిన గది తలుపు ఫొటోను కూడా భారత్లోని ఇజ్రాయెల్ ఎంబసీ పోస్ట్ చేసింది. ‘‘భారత వీరవనితలు వీరు. హమాస్ దాడి నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడారు’’ అని కొనియాడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు ఈ విధమైన తప్పుడు సర్వేలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. -
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
కన్యాకుమారిలో దాదాపు 45గంటల పాటు ధ్యానం ముగించుకున్న ప్రధాని మోదీ.. వివిధ అంశాలపై సమీక్షలతో ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా కొనసాగుతోంది. -
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
నేడు తిహాడ్ జైల్లో లొంగిపోనున్న సందర్భంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి ఎక్స్లో తన సందేశాన్ని వెలువరించారు. -
పుణె కారు ప్రమాదం..దర్యాప్తునకు 100మంది పోలీసులు
పుణె కారు ప్రమాదం కేసులో దర్యాప్తును వేగవంతం చేయడానికి 100మంది సిబ్బందితో కూడిన బృందాలను రంగంలోకి దింపినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. -
7 నిమిషాల్లో 15 వేల మెరుపులు
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. -
మరణ వాంగ్మూలానికి తిరుగులేదు: సుప్రీం
ఓ వ్యక్తి మరణ వాంగ్మూలం నిజమైనదని కోర్టు విశ్వసిస్తే నిందితుడికి శిక్ష వేయడానికి అదొక్కటే చాలని, దానికి వేరెవరి ధ్రువీకరణ అక్కర్లేదని సుప్రీం కోర్టు మే 15న స్పష్టం చేసింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని దిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. -
సల్మాన్ఖాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగ్గర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ఖాన్పై దాడి లక్ష్యంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పక్కాగా కుట్రలు పన్నుతోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
సంక్షిప్త వార్తలు (7)
సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు అంతర్గత విభాగంగా ఇది పని చేయనుంది. -
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
రెండు ఇండిగో విమానాలకు సంబంధించి వచ్చిన బాంబు బెదిరింపులు శనివారం అధికారులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. చివరకు ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
మహారాష్ట్రలోని పుణెలో మైనర్ దురుసు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పోలీసులు శనివారం బాలుడి తల్లిని అరెస్టుచేశారు. ప్రమాద సమయంలో ఆ మైనర్ మద్యం తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్త నమూనాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం పూర్తయింది. ఇక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ మండపంలో గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన ఆయన.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూర్తి చేశారు. -
కేరళ, అస్సాంలకు భారీ వరద
రెండు తుపానుల కారణంగా కేరళ, అస్సాంలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. -
‘అగ్నిపథ్’లో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి రాహుల్ లేఖ
సైనిక నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ పథకంలో చేరి అమరులయ్యే సైనికుల కుటుంబాలకు అందించే ప్రయోజనాల్లో వివక్ష ఉంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రతకు సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దిల్లీలోని ముంగేశ్పుర్ వాతావరణ కేంద్రంలో ఇటీవల అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించడంపై కేంద్రం స్పందించింది. దానికి సెన్సర్ సరిగా పని చేయకపోవడమే కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్