లులూ సంస్థల ఛైర్మన్‌కు తప్పిన ప్రమాదం!

దేశంలో అతిపెద్ద షాపింగ్‌ మాళ్లలో ఒకటైన లులూ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఎం.ఏ.యూసఫ్‌ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను సాంకేతిక లోపాల కారణంగా

Updated : 11 Apr 2021 14:51 IST

కొచ్చి: దేశంలో అతిపెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఒకటైన లులూ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఎం.ఏ.యూసఫ్‌ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను సాంకేతిక లోపం కారణంగా కొచ్చిలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. చిత్తడి భూమిలో హెలికాప్టర్‌ దిగడంతో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్‌ అయిన సమయంలో హెలికాప్టర్‌లో అలీ దంపతులతో పాటు మరో ఏడుగురు ఉన్నారు. ల్యాండింగ్‌ తర్వాత వారందరినీ సమీపంలోని ప్రైవేట్‌ అసుపత్రికి తరలించారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారందరినీ ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని