గ్రామ పంచాయతీ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామ పంచాయతీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన వివాదాస్పదమైంది. దీనిపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Published : 21 Jul 2023 16:35 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ గ్రామ పంచాయతీ తీసుకొచ్చిన నిబంధన వివాదాస్పదమైంది. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, పంచాయతీ సిబ్బంది మాత్రం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కొత్త నిబంధన గురించి వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

సీఎం నివాసంలోకి ఆయుధాలతో చొరబాటుకు యత్నం.. బెంగాల్‌లో కలకలం!

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామస్థులు తమ పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. పశువుల నిర్వహణలో గ్రామస్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, రోడ్లపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ పశువులను గ్రామంలోని వీధుల్లో తిరిగేందుకు విడిచిపెడితే.. వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలతోపాటు, రూ. 500 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ మేరకు గ్రామంలో కొత్త నిబంధనపై ప్రకటన చేయించారు. అయితే, ఈ ప్రకటన విన్న గ్రామస్థులు మాత్రం ఇదేం వింత నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకొని.. నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని