Udhayanidhi: దృష్టి మరల్చేందుకే ‘సనాతన రగడ’.. కేసులన్నీ చట్టపరంగా ఎదుర్కొంటా: ఉదయనిధి
Udhayanidhi: భాజపా కేవలం బురదజల్లే ప్రయత్నాల్లో మాత్రమే ఉందని ఉదయనిధి అన్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో.. కేంద్రంలో భాజపా ఒక్క ప్రగతిశీల పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు.
చెన్నై: ‘సనాతన ధర్మం (Sanatan Dharma)’పై తాను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరిస్తోందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. ఈ విషయంలో తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. భాజపా (BJP) శ్రేణుల నుంచి తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆయన స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (Modi)ని ఉదయనిధి విమర్శించారు. ఆయనను ‘ప్రపంచ యాత్రికుడు’ అంటూ ఎద్దేవా చేశారు. మణిపుర్లో జరుగుతున్న హింసపై ప్రశ్నలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘గత తొమ్మిదేళ్లుగా మీరు (భాజపా) ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ప్రజా సంక్షేమానికి మీరు ఏం చేశారన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే భాజపా నేతలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. దీన్ని వారు తమని తాము రక్షించుకోవడానికి ఆయుధంగా వాడుకొంటున్నారు’’ అని ఉదయనిధి (Udhayanidhi Stalin) అన్నారు.
‘‘గౌరవప్రదమైన పదవుల్లో ఉండి ఇలా అపవాదులు మోపుతున్నందుకు నేనే మీపై కేసులు పెట్టాలి. కానీ, మీ మనుగడ కొనసాగడానికి ఇదే ఆధారమని నాకు తెలుసు. బతుకుదెరువుకు మీకు మరో మార్గం తెలియదు. అందుకే మీపై కేసులు పెట్టొద్దని నిర్ణయించుకున్నా. మేం డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ దిగ్గజం అన్నాదురై రాజకీయ వారసులం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసు’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘ఏ మతమైనా ప్రజలను సమానత్వం వైపు నడిపిస్తూ.. సౌభ్రాతృత్వాన్ని బోధించినట్లైతే.. నేనూ ఆధ్యాత్మికవాదినే. ఒకవేళ ఏదైనా మతం కులాల పేరిట ప్రజలను విభజిస్తూ.. అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే.. అలాంటి మతాన్ని వ్యతిరేకించే వారిలో నేను ముందుంటాను’’ అని గతంలో అన్నాదురై అన్నట్లు ఉదయనిధి ఈ సందర్భంగా తెలిపారు. అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందని పేర్కొన్నారు.
భాజపా వీటిని అర్థం చేసుకోకుండా.. కేవలం బురదజల్లే ప్రయత్నాల్లో మాత్రమే ఉందని ఉదయనిధి అన్నారు. మోదీ, ఆయన బృందం పూర్తిగా ఈ కార్యక్రమాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో.. కేంద్రంలో భాజపా ఒక్క ప్రగితిశీల పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు. మణిపుర్ హింస వంటి అంశాల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ, ఆయన బృందం.. తన వ్యాఖ్యల్ని ఆయుధంగా మలుచుకుంటోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty)పై ఆన్లైన్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. -
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టే చర్యలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. -
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
ముంబయిలో ఇటీవల చోటుచేసుకున్న హోర్డింగ్ దుర్ఘటనను ఎనిమిదేళ్ల క్రితమే ఓ రచయిత తన పుస్తకంలో ప్రస్తావించారు. -
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
సీఏఏ అమల్లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరుచేసింది. -
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
ముంబయిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న హోర్డింగ్ను అక్రమంగా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. -
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
గాజాలో పని చేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతిపై ఐక్యరాజ్యసమితి సంతాపం తెలియజేసింది. -
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
మరోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపడితే.. పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి