మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.
బెంగళూరు: జేడీఎస్ నేత, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో దుమారం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలుగుచూసిన ఈ ఘటనపై సొంత పార్టీనుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే శరణ్గౌడ కంద్కూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయత్వానికి లేఖ రాశారు. ‘‘ఆ వీడియోలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అవి పార్టీతో పాటు మీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి’’ అని దేవెగౌడకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘ఆయనపై భుజం మీద చేయివేసి ప్రధాని ఫొటో దిగారు. 10 రోజుల కిందట స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. వేదికపైనే ప్రశంసించారు. ఇప్పుడు ఆ కర్ణాటక నేత విదేశాలకు పారిపోయారు. ఈ ఘోరాల గురించి తెలిసిన తర్వాత తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఎందరో మహిళలు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు కూడా మోదీ మౌనంగా ఉంటారా..?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘ఇంకా జేడీఎస్తో భాజపా ఎందుకు పొత్తు కొనసాగిస్తోంది..? ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
ఇదిలా ఉంటే.. ఇదే విషయమై గత డిసెంబర్లో రాష్ట్ర యూనిట్కు తాను లేఖ రాసినట్లు తాజాగా భాజపా నేత దేవరాజె గౌడ వెల్లడించారు. దాదాపు 3వేల అభ్యంతరకర వీడియోలున్న పెన్డ్రైవ్ తనకు అందిందని చెప్పారు. వాటిని ఉపయోగించి ప్రజ్వల్ పలువురు మహిళలను బ్లాక్ బెయిల్ చేసేవారని ఆరోపించారు. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ కుటుంబంలోని చాలామంది వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే తరహా పెన్డ్రైవ్ కాంగ్రెస్ జాతీయ నాయకుల వద్ద కూడా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ జేడీఎస్తో పొత్తుపెట్టుకొని, హాసన నుంచి ఆ పార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచితే.. వీడియోలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటారు. రేపిస్టులతో పొత్తు పెట్టుకున్న పార్టీగా మనకు విమర్శలు వస్తాయి. ఇది మన పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా హసన్ స్థానం నుంచి ప్రజ్వల్ మరోసారి బరిలో దిగారు. ఏప్రిల్ 26నే ఈ స్థానానికి పోలింగ్ ముగిసింది. అయితే.. పోలింగ్కు ముందు నుంచే ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు హసన్ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రజ్వల్ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, తప్పు చేస్తే శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తెలిపారు. అతడు విదేశాలకు వెళ్లడంలో తన ప్రమేయం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty)పై ఆన్లైన్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. -
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టే చర్యలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. -
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
ముంబయిలో ఇటీవల చోటుచేసుకున్న హోర్డింగ్ దుర్ఘటనను ఎనిమిదేళ్ల క్రితమే ఓ రచయిత తన పుస్తకంలో ప్రస్తావించారు. -
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
సీఏఏ అమల్లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరుచేసింది. -
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
ముంబయిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న హోర్డింగ్ను అక్రమంగా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. -
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
గాజాలో పని చేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతిపై ఐక్యరాజ్యసమితి సంతాపం తెలియజేసింది. -
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
మరోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపడితే.. పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!