Bengaluru: చెత్తకుప్పలో రూ.25 కోట్లు..!

చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు ఓ చెత్తకుప్పలో కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి తరలించారు.

Published : 10 Nov 2023 02:23 IST

బెంగళూరు: సాధారణంగా రూ.లక్షల విలువ చేసే కరెన్సీ దొరికితేనే ఒకింత ఆశ్చర్యాన్ని గురవుతాం. అలాంటిది ఒక్కసారిగా రూ.25కోట్లు కంటపడితే.. అది కూడా ఓ చెత్తకుప్పలో..! బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తికి నవంబర్‌ 1న ఇలాంటి షాకింగ్‌ అనుభవమే ఎదురైంది. అయితే, అది భారతీయ కరెన్సీ కాదు.. అమెరికా డాలర్లు. సల్మాన్‌ షేక్‌ అనే వ్యక్తి బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా 23 కట్టల అమెరికన్‌ డాలర్లు అతడికి కనిపించాయి. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అతడు.. ఆ కట్టలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. నవంబర్‌ 5న ఆ మొత్తాన్ని తన యజమాని బప్పాకి అప్పగించాడు.

అతడు ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్త కలిముల్లాహ్‌కి తెలియజేయగా.. ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానందకు ఈ విషయాన్ని వివరించారు. వారిద్దరితో మాట్లాడిన ఆయన.. కేసును దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బల్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌ డాలర్‌ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అవి ఒరిజినల్‌ డాలర్లేనా?లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు