పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఘర్షణ!

హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీలు కొట్టుకున్నారు. ఒక ఎస్పీని మరో ఎస్పీ చెంప దెబ్బకొడితే, మరో అధికారి అలా కొట్టిన అతడిని కాలితో తన్నాడు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ పోలీసుశాఖలో తీవ్ర దుమారం రేగుతోంది. 

Published : 25 Jun 2021 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీలు కొట్టుకున్నారు. ఒక ఎస్పీని మరో ఎస్పీ చెంప దెబ్బకొడితే, మరో అధికారి అలా కొట్టిన అతడిని కాలితో తన్నాడు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ పోలీసుశాఖలో తీవ్ర దుమారం రేగుతోంది. 

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా కులు విమానాశ్రయం సమీపంలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై సీఎం భద్రతా సిబ్బంది, కులు జిల్లా ఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, సీఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ చెంప చెళ్లుమనిపించాడు. అక్కడే ఉన్న, సీఎం జైరాం ఠాకూర్‌ భద్రతాధికారిగా వ్యవహరిస్తున్న బల్వంత్ సింగ్, కులు ఎస్పీ గౌరవ్ సింగ్‌ను కాలితో తన్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హిమాచల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని