Bipin Rawat: కొవిడ్ వేళ.. 500శాతం పెరిగిన సైబర్ నేరాలు!
మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో సైబర్ నేరాలు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి సైబర్ నేరాల్లో దాదాపు 500శాతం పెరుగుదల కనిపించినట్లు భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరోసారి గుర్తుచేశారు.
ఐటీ చట్టానికి సవరణలు అవసరమన్న త్రిదళాధిపతి
దిల్లీ: మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో సైబర్ నేరాలు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి సైబర్ నేరాల్లో దాదాపు 500శాతం పెరుగుదల కనిపించినట్లు భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరోసారి గుర్తుచేశారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం, రాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కలిగే ముప్పును ప్రముఖంగా ప్రస్తావించారు. ‘c0C0n’ పేరుతో కేరళ పోలీసులు వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన 14వ ‘హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన జనరల్ బిపిన్ రావత్.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐటీ చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీ చట్టానికి సవరణలు అవసరం..
సైబర్ భద్రత కోసం రాష్ట్రస్థాయిలో సైబర్ సెల్లు, కేంద్ర స్థాయిలోనూ వివిధ శాఖలకు నిపుణులు ఉన్నారు. ఇందుకోసం వివిధ మంత్రిత్వ శాఖలు కూడా పలు ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఇలా డిజిటల్ సమాచారాన్ని సమర్థవంతంగా భద్రపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఈ వర్చువల్ స్పేస్ నిర్వహణ కోసం ఓ ప్రత్యేక ఫ్రేమ్వర్క్ అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రోజురోజుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోన్న సమయంలో.. వీటితో ఎదురయ్యే ప్రమాదాలను కూడా అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా డ్రోన్లు, రాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలతో పొంచివున్న ముప్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వర్చువల్ కరెన్సీ, బ్లాక్చెయిన్ వ్యాప్తి కూడా ఎక్కువైన నేపథ్యంలో మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా భారత చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ చట్టం-2000కు సవరణలు చేయాల్సిన అవసరాన్ని జనరల్ బిపిన్ రావత్ నొక్కిచెప్పారు. దీనికి తోడు డేటా సంరక్షణ బిల్లు (Data Protection Bill) 2019 కూడా సాధ్యమైనంత తొందరగా చట్టరూపం దాల్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
లాక్డౌన్ సమయంలో చోటుచేసుకున్న ఆన్లైన్ మోసాలపై చర్చించే లక్ష్యంతో సొసైటీ ఫర్ ది పోలీసింగ్ ఆఫ్ సైబర్స్పేస్ (POLCYB), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ (ISRA) స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కేరళ పోలీసులు ‘c0c0n’ సదస్సు నిర్వహించారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని సైబర్ సెక్యూరిటీపై కీలక ప్రసంగాలు చేశారు. సైబర్నేరాలు, హ్యాకింగ్పై ప్రజల్లో అవగాహన కలిగించడంతోపాటు ఆన్లైన్ తరగతులు జరుగుతోన్న సమయంలో ఎన్నో నేరాలు చోటుచేసుకున్న దృష్ట్యా ఆన్లైన్ భద్రతపై చిన్నారులకు కూడా దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం గతేడాది (2000) దేశవ్యాప్తంగా 50,035 సైబర్ నేరాలు నమోదయ్యాయి. 2019లో సుమారు 27వేల సైబర్ నేరాలు చోటుచేసుకోగా 2019లో 44వేలకు పెరిగాయి. గతేడాది దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ సైబర్ నేరాల్లో దాదాపు 12శాతం పెరుగుదల కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ దేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. -
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
లోక్సభ ఎన్నికల వేళ.. ఒడిశాకు చెందిన ఒక ఉన్నతాధికారిణిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
దేశ రాజధానిలో ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. -
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్పై ఒక యువతి చేసిన ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. -
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం