Modi US visit: వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికే ఈ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అగ్రదేశం అమెరికా పయనమయ్యారు. ఈ సందర్భంగా ప్రకటన ద్వారా పర్యటన ఉద్దేశాన్ని వెల్లడించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన మంచి సందర్భమని అభివర్ణించారు.
అగ్రదేశం పర్యటనకు ముందు ప్రకటించిన ప్రధాని
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అగ్రదేశం అమెరికా పయనమయ్యారు. ఈ సందర్భంగా ప్రకటన ద్వారా పర్యటన ఉద్దేశాన్ని వెల్లడించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన మంచి సందర్భమని అభివర్ణించారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని క్వాడ్ నేతలతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఇరువురు నేతల మధ్య తొలిసారి ముఖాముఖి జరగనుంది. ‘భారత్, యూఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్తో కలిసి సమీక్షించనున్నాను. పరస్పర ప్రయోజనాలు కలిగిన సమస్యలపై అభిప్రాయాలు పంచుకోనున్నాను’ అంటూ మోదీ ఆ ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
పర్యటనకు ముందు మోదీ ట్విటర్లో కూడా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు పయనమైనట్లు వెల్లడించారు. పలు అంతర్జాతీయ సమస్యలపై ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో కూడా చర్చించనున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్