Zika Virus: కేరళలో పెరుగుతున్న జికా కేసులు.. తగ్గని కొవిడ్‌!

కరోనా విజృంభణతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం మరో మూడు కొత్త కేసులు.....

Published : 22 Jul 2021 21:09 IST

తిరువనంతపురం: కరోనా విజృంభణతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కి చేరింది. తాజాగా ఈ వైరస్‌ సోకిన వారిలో తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తితో పాటు పెట్ట ప్రాంతంలోని 38 ఏళ్ల వ్యక్తి, అనయరకు చెందిన మూడేళ్ల బాలుడు ఉన్నట్టు వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. తిరువనంతపురంలోని మెడికల్‌ వైరాలజీ ల్యాబ్‌లోనే ఈ కేసులు నిర్ధారణ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారని వివరించారు. వైద్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం జికా సోకిన వారిలో చాలా మంది ఆస్పత్రుల్లో చేరడంలేదని, అందరి పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. మరోవైపు, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. గురువారం 12,818 కొత్త కేసులు నమోదు కాగా.. 122 మంది మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని