జూన్లో ఓటీటీ వేదికగా ‘జగమే తంత్రం’!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలి నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ధనుశ్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తమిళ చిత్రం ‘జగమే తందిరమ్’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలి నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ధనుశ్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘జగమే తందిరమ్’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్డౌన్/కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూన్ 11 లేదా 13వ తేదీన విడుదల చేయాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయట. వచ్చే నెలలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని విడుదల చేయనున్నారట. ధనుష్ ఇందులో సూరాలి అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా చిత్రంగా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర నిర్మాతలు. సంతోష్ నారాయణ స్వరాలు సమకూరుస్తుండగా వివేక్ హర్షన్ ఎడిటర్ పనిచేశారు. ధనుశ్కి ఇది 40వ సినిమా కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?