అప్పుడు నాన్నను చూస్తే బాధేసింది: రానా
ఆరోగ్యం గురించి సమంత అడిగిన ప్రశ్నకు రానా ఏం చెప్పాడంటే?
హైదరాబాద్: భల్లాలదేవుడిగా కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసిన రానా కొంతకాలం క్రితం అకస్మాత్తుగా సన్నగా మారిపోయి అందర్నీ షాక్కు గురిచేశాడు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొచ్చాయి. కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్నాడని ఆ వార్తల సారంశం. అయితే వాటిపై ఆప్పుడు రానా కానీ, అతని బృందం కానీ స్పందించలేదు. తాజాగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘సామ్జామ్’ కార్యక్రమంలో రానా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘రెండేళ్ల క్రితం మనందరం కలసి కశ్శీర్ టూర్కి వెళ్లాం. అక్కడ కళ్లకు సంబంధించి ఓ శస్త్ర చికిత్స చేయించుకుంటా అని చెప్పారు. కానీ 24 గంటలు గడిచేసరికి మీ ఆరోగ్యం ఇబ్బందికరమైన సమాచారం విన్నాం. అసలు అప్పుడేం జరిగింది?’ అని రానాని సమంత అడిగింది. దానికి రానా చెప్పిన సమాధానం విని సమంత కన్నీరు పెట్టుకుంది. అసలు రానా ఏం చెప్పాడంటే?
‘‘జీవితం వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో చాలామందిలాగే నాకు కూడా చిన్న పాజ్ వచ్చింది. ‘అరణ్య’ షూటింగ్కి కొన్నిరోజుల ముందు.. పాత్రకు అనుగుణంగా నా కళ్లకు లేసిక్ సర్జరీ చేయించుకుందాం అనుకున్నా. శస్త్రచికిత్స కోసం చిన్నతనం నుంచి నాకు తెలిసిన వైద్యుణ్ని సంప్రదించాను. ఆయన బీపీ టెస్ట్ చేసి ‘నీ ఆరోగ్యం బాగానే ఉందా?నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?’ అని అడిగారు. అలా ఏం లేదు సర్.. నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. కొంత సమయం తర్వాత.. ‘నీకు బీపీకి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తోంది. సర్జరీని మరో రోజుకి వాయిదా వేద్దాం. ఈ లోపు మరో డాక్టర్ని కలువు’ అని సూచించారు. ఆ వైద్యుడు దగ్గరకు వెళ్తే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు రకరకాల పరీక్షలు చేశారు. అదే రోజు రాత్రి ఆ ఆస్పత్రి హెడ్ నా దగ్గరకి వచ్చి ‘నీకు ఆరోగ్యపరంగా సమస్య ఉంది. ఇంకొన్ని పరీక్షలు చేయాలి’ అని చెప్పారు. దీంతో వెంటనే నాన్నని తీసుకుని యూఎస్ వెళ్లాను. అక్కడ ఓ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు వైద్యులు పరీక్షించారు’’ అని చెప్పారు రానా.
అమెరికాలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెబుతూ... ‘‘నువ్వు పుట్టినప్పటి నుంచే నీకు బీపీ ఉంది. దాని వల్ల నీకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కిడ్నీలు పాడయ్యాయి. నువ్వు ఇప్పుడు చికిత్స తీసుకోకపోతే చాలా ఇబ్బంది. ఆరు నెలల నుంచి సంవత్సరంలో గుండెపోటు రావొచ్చు, లేదా మెదడులో నరాలు చిట్లి పోవడానికి 70 శాతం అవకాశం ఉంది. అంతేకాదు చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉంది’’ అని వైద్యులు చెప్పారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని చెప్పారు. మాంసాహారం, ఉప్పు తినొద్దని సూచించారు. ‘‘వైద్యుల సూచనలు పాటించి, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా తిరిగి స్వదేశానికి వచ్చాను. యూఎస్లో ఉన్న రోజులు చాలా క్లిష్టమైనవి. ఆ సమయంలో నాన్నని చూస్తే బాధగా అనిపించింది’’ అని రానా నాటి పరిస్థితుల గురించి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!