Aishwarya Rajesh: అందుకే చాలామంది హీరోయిన్స్‌కు అవకాశాలు రావడం లేదు: ఐశ్వర్య రాజేశ్‌

నటి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ తన కెరీర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Jul 2023 17:51 IST

హైదరాబాద్‌: ఇటీవల ‘ఫర్హానా’ (Farhana) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు నటి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh). తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య.. తన కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు నాయికా ప్రాధాన్య సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారో వివరించారు. చాలామంది సినీ ప్రముఖులు తన నటనను ప్రశంసించారు కానీ, తనకు అవకాశం మాత్రం ఇవ్వడం లేదని అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

‘‘నా తొలి తమిళ సినిమా విడుదలయ్యాక ఎంతో మంది నాకు ఫోన్‌ చేసి ప్రశంసించారు. కానీ ఎవ్వరూ వారి చిత్రాల్లో అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఏడాదిన్నర పాటు నేను ఖాళీగా ఉన్నాను. పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. ఈ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే చాలా మంది నటీమణులకు అవకాశాలు రావడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అగ్ర నటులు నన్ను, నా నటనను ఎన్నో వేదికలపై పొగిడారు. కానీ వాళ్ల సినిమాల్లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు. దీంతో నేను చిన్న సినిమాలైనా.. నాయికా ప్రాధాన్యం ఉన్న వాటిలో నటించాలని నిర్ణయించుకున్నాను’’.

‘‘కన్నా’ అనే ఓ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో చూశాను. దానికి ఎంతో ప్రేక్షకాదరణ లభించింది. దాన్ని చూసే నేను స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు 15 మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాను. అయినా నాకు అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలియడం లేదు. అయినా నా సినిమాకు నేను హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకంటూ నా సొంత ప్రేక్షకులు ఉన్నారు’’ అని ఐశ్వర్య రాజేష్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని