YSJagan: జగన్ బయోపిక్‌.. నటుడెవరంటే?

మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కించి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు మహి వి. రాఘవ్‌. ఇప్పుడాయన రాజశేఖర్‌ రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 02 Jul 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కించి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు మహి వి. రాఘవ్‌. ఇప్పుడాయన రాజశేఖర్‌ రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి మరణానికి ముందు నెలకొన్న పరిస్థితుల నుంచి 2019 ఎన్నికల్లో జగన్‌ అందుకున్న విజయం వరకు ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. దాంతో జగన్‌ పాత్రని పోషించేందుకు బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ గాంధీని ఎంపిక చేశారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇంగ్లిష్‌, గుజరాతీ, హిందీ చిత్రాల్లో నటించిన ప్రతీక్‌ గతేడాది విడుదలైన ‘స్కామ్‌ 1992’ అనే వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని