వినాయక చవితి కానుకగా ‘అఖండ’..!
కరోనా ఉద్ధృతి తగ్గడంతో చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ సైతం చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఉద్ధృతి తగ్గడంతో చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరగడంతో చిత్రీకరణ తుదిదశలో ఉండగా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. ఈ వినాయక చతుర్థి కానుకగా అంటే సెప్టెంబర్ 10న థియేటర్లలో బాలకృష్ణ ‘అఖండ’గా సందడి చేయబోతున్నారన్నమాట. మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.