Gaddar: ప్రజా గాయక.. సెలవిక..!
కాలికి గజ్జెకట్టి.. ప్రజాక్షేత్రంలో పాటల తూటాలు కురిపించిన ప్రజా గాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు.
కాలికి గజ్జెకట్టి.. ప్రజాక్షేత్రంలో పాటల తూటాలు కురిపించిన ప్రజా గాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ‘బండెనక బండి కట్టి...’ (మాభూమి), ‘భద్రం కొడుకో...’ (రంగులకల), ‘ఆగదు ఆగదు... ఈ ఆకలి పోరు ఆగదు...’ (అడవి బిడ్డలు), ‘భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదలకి కొదువలేదురా.. (దండకారణ్యం) ‘మల్లెతీగకు పందిరివోలె మసక సీకటిలో వెన్నెలవోలె.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... (ఒరేయ్ రిక్షా), పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా (జై బోలో తెలంగాణ).. ఇలా ఎన్నో పాటలతో రచయితగా, గాయకుడిగా, నటుడిగా మారి సినిమాల్ని ప్రభావితం చేశారు. ప్రజా సమస్యలు, ఉద్యమాలు, సామాన్యుడి పోరాటం తదితర ఇతివృత్తాలతో తెరకెక్కిన చాలా సినిమాల్లో గద్దర్ పాట వినిపించింది. బి.నర్సింగరావు, ఆర్.నారాయణమూర్తి, ఎన్.శంకర్ తదితర దర్శకుల సినిమాల్లో గద్దర్ పాటలు ఘనంగా వినిపించాయి.
ఆర్.నారాయణమూర్తి దర్శకనిర్మాణంలో రూపొందిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలోని అన్ని పాటల్నీ గద్దర్ రాయడం విశేషం. ఆ సినిమాలోని ‘మల్లెతీగకు పందిరివోలె...’ పాటకి ఉత్తమ గేయ రచయితగా గద్దర్కీ, ఉత్తమ గాయకుడిగా వందేమాతరం శ్రీనివాస్లకు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు లభించాయి. ‘జై బోలో తెలంగాణ’లోని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...’ పాటకి కూడా ఉత్తమ గాయకుడిగా నంది అందు కున్నారు. కానీ విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలకీ, బహుమతులకి దూరంగా ఉండాలనే నియమంతో వాటిని తిరస్కరించారు. చివరిగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో నటించడంతోపాటు, పాటలు కూడా రాశారు. గద్దర్ ఇక లేరని తెలిసి చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
- సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో దశాబ్దాలపాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరనే వార్త తీవ్ర విషాదం నింపింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకి లాల్సలాం’’.
చిరంజీవి, కథానాయకుడు
- తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకొస్తారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు’’.
బాలకృష్ణ, కథానాయకుడు
- గద్దర్ ప్రజా వాగ్గేయకారుడు. తాడిత, పీడిత ప్రజల సాహితీవేత్త. 1976లో తొలిసారి హైదరాబాద్ ప్రజానాట్యమండలి మహాసభల్లో గద్దర్ను కలిశాను. ఆయన పాటలు నన్నెంతో ఉత్తేజ పరిచాయి. నాలాంటి గాయకులకు, సాంస్కృతిక కళాకారులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. పాల్ రాక్సన్ ఆఫ్రికా ప్రజాగాయకుల పాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. మైకేల్ జాక్సన్ది మట్టిమనుషుల్లో ఉండే కంఠమైనందునే అందరినీ ఆకట్టుకుందనీ, కళాకారుల్లోనూ అలాంటి ప్రత్యేకతలు ఉండాలనేవారు. ఆయన మరణం ప్రజా సాహిత్యానికి తీరని లోటు.
గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్
- ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక పాల్ రాబ్సన్, ఒక గద్దర్... ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసింది. ప్రజా యుద్ధనౌక గొంతు మూగబోయిందని తెలిసి కన్నీళ్లొచ్చాయి. ఆ మహాకవి మృతి యావత్ దేశానికి తీరని లోటు. భారతదేశంలోని పీడిత ప్రజల ఆక్రందన, ఆవేదన, ఆవేశాన్ని తన పాటతో పలికించారు. ఆయనకీ, ఆయన పాటకీ మరణం లేదు. ఆయనకూ, నాకూ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై...’ పాటతో నన్ను ఎంతోమంది మహిళల హృదయాలకి చేరువ చేసిన ఆ మహానుభావుడి రుణం తీర్చుకోలేనిది. చనిపోయేవరకూ ఆయన ప్రజల పక్షానే నిలబడ్డారు. చివరిగా ‘యూనివర్సిటీ’ కోసం మేం కలిశాం. అందులో పాట రాసి, పాడిన ఆయన సినిమానీ చూసి గొప్పగా ఉందని మెచ్చుకున్నారు. ఆయన ప్రజాపక్షాన ఉంటూనే అమరులయ్యారు.
ఆర్.నారాయణమూర్తి, దర్శకనిర్మాత, నటుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త సినిమా రాక... థియేటర్ నిండక...
వేసవి వినోదం అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది... సినిమానే. సుదీర్ఘంగా సాగుతుంది ఈ సీజన్. స్టార్ హీరోల చిత్రాలు...పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు... -
దిమాక్ కిరికిరి
‘కిరాక్ పోరి వస్తే సైట్ మార్... ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్పా మార్... ఇదే నా స్టైల్’ అంటున్నాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. -
ఆరుతో అదృష్టం కలిసిరావాలి
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్ యువకథానాయిక జాన్వీ కపూర్. -
అహం.. కలహం
దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రమిది. -
ఆ హత్యల వెనక ఒక్కడు?
ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్పైకి!
‘మలైకోటై వాలిబన్’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్లాల్. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన. -
ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?