సైరెన్‌ మోగేది 23న

జయం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భావోద్వేగాల మేళవింపుతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

Published : 15 Feb 2024 01:46 IST

యం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భావోద్వేగాల మేళవింపుతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి ఈ నెల 23 విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ...‘ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. దీన్ని ఓ బాధ్యతగా స్వీకరించారు జయం రవి. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం నాలో స్ఫూర్తి నింపింది’ అన్నారు. ‘భావోద్వేగాలతో కూడిన పాత్రలకు జీవీ ప్రకాశ్‌ తన సంగీతంతో ప్రాణం పోశారు. పోలీసు ఆఫీసర్‌గా నటించిన కీర్తి మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు జయం రవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని