Anupama parameswaran: మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది.
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పుడు అనుపమ దగ్గరకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా అనుపమను ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం చిత్ర వర్గాలు ఆమెతో కథా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దీనిపై తను కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇది బెల్లంకొండ - అనుపమలకు రెండో చిత్రమవుతుంది. ఇది వరకు వీళ్లిద్దరూ ‘రాక్షసుడు’లో కలిసి నటించారు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్గా ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ‘కిష్కిందపురి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త సినిమా రాక... థియేటర్ నిండక...
వేసవి వినోదం అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది... సినిమానే. సుదీర్ఘంగా సాగుతుంది ఈ సీజన్. స్టార్ హీరోల చిత్రాలు...పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు... -
దిమాక్ కిరికిరి
‘కిరాక్ పోరి వస్తే సైట్ మార్... ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్పా మార్... ఇదే నా స్టైల్’ అంటున్నాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. -
ఆరుతో అదృష్టం కలిసిరావాలి
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్ యువకథానాయిక జాన్వీ కపూర్. -
అహం.. కలహం
దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రమిది. -
ఆ హత్యల వెనక ఒక్కడు?
ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్పైకి!
‘మలైకోటై వాలిబన్’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్లాల్. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన. -
ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!