Anupama parameswaran: మళ్లీ కలిసేనా?

‘టిల్లు స్క్వేర్‌’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్‌. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Updated : 30 Apr 2024 09:38 IST

టిల్లు స్క్వేర్‌’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్‌. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పుడు అనుపమ దగ్గరకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా అనుపమను ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం చిత్ర వర్గాలు ఆమెతో కథా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దీనిపై తను కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇది బెల్లంకొండ - అనుపమలకు రెండో చిత్రమవుతుంది. ఇది వరకు వీళ్లిద్దరూ ‘రాక్షసుడు’లో కలిసి నటించారు. ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ‘కిష్కిందపురి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని