Anupama parameswaran: మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది.
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పుడు అనుపమ దగ్గరకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా అనుపమను ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందని సమాచారం. ప్రస్తుతం చిత్ర వర్గాలు ఆమెతో కథా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దీనిపై తను కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇది బెల్లంకొండ - అనుపమలకు రెండో చిత్రమవుతుంది. ఇది వరకు వీళ్లిద్దరూ ‘రాక్షసుడు’లో కలిసి నటించారు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్గా ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ‘కిష్కిందపురి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు నుంచి ఆరంభం
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
నేనేంటో నిరూపించుకోవడమే ముఖ్యం
‘‘కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. -
సంగీత పరిణామం... మనోహర ప్రయాణం
సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్. రెహమాన్ ఒకరు. -
ఈసారీ వర్షం పడింది.. విజయమే
‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కించారు. -
దీపావళికి కంగువా..?
మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు. -
వివాదంలో పాయల్ రాజ్పూత్
నటి పాయల్ రాజ్పూత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్) అనే చిత్రంలో నటించింది. -
పాత్ర కోసం నిజమైన బంగారం
భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ మిరాయ్
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
నటి పాయల్ రాజ్పుత్ సోషల్మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.