ఈ ఇద్దరూ సౌదీకి ప్రయాణం

షారుక్‌ఖాన్‌ ప్రస్తుతం ‘పఠాన్‌’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత ఆయన ‘డుంకీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Published : 13 Nov 2022 02:33 IST

షారుక్‌ఖాన్‌ ప్రస్తుతం ‘పఠాన్‌’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత ఆయన ‘డుంకీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘డుంకీ’. ఇందులో షారుక్‌, తాప్సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఓ పదిహేను రోజుల పాటు సౌదీ అరేబియాలో జరగనుంది. దీని కోసం షారుక్‌, తాప్సి సౌదీకి పయనం కానున్నారు. అక్కడి నుంచి వచ్చాకా పంజాబ్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్‌ చేయనున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబరు 22న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని