పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా?
‘గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’లో
అలనాటి ముద్దుగుమ్మ రీఎంట్రీపై కథనాలు
హైదరాబాద్: ‘గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’లో నటించారు. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మరే ఇతర చిత్రంలోనూ పూర్తిస్థాయి పాత్రలో కనిపించలేదు. 2004లో విడుదలైన ‘మిస్సమ్మ’లో అన్షూ ఓ గెస్ట్ రోల్లో సందడి చేశారు.
కాగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ అంబానీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. త్రివిక్రమ్-తారక్ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో అన్షూ కీలక పాత్రను పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. #NTR30గా పట్టాలెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వరీన హుస్సేన్ రెండో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి
రాజగోపాల్ ఎవరో నాకు తెలీదు: నరేష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్