పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా?

‘గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్‌ సరసన ‘రాఘవేంద్ర’లో

Published : 06 Feb 2021 14:58 IST

అలనాటి ముద్దుగుమ్మ రీఎంట్రీపై కథనాలు

హైదరాబాద్‌: ‘గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్‌ సరసన ‘రాఘవేంద్ర’లో నటించారు. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మరే ఇతర చిత్రంలోనూ పూర్తిస్థాయి పాత్రలో కనిపించలేదు. 2004లో విడుదలైన ‘మిస్సమ్మ’లో అన్షూ ఓ గెస్ట్‌ రోల్‌లో సందడి చేశారు.

కాగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ అంబానీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో అన్షూ కీలక పాత్రను పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. #NTR30గా పట్టాలెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ రెండో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని