Indian Police Force: సిద్ధార్థ్ మల్హోత్రా.. రోహిత్ శెట్టి.. ఓ వెబ్సిరీస్
యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు రోహిత్ శెట్టి. తన తర్వాతి ప్రాజెక్టుగా మరో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్సిరీస్ను ప్రకటించారు. టైటిల్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. సిద్ధార్థ్ మల్హోత్ర ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు.
యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు రోహిత్ శెట్టి. తన తర్వాతి ప్రాజెక్టుగా మరో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్సిరీస్ను ప్రకటించారు. టైటిల్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. సిద్ధార్థ్ మల్హోత్ర ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. కబీర్ మాలిక్ అనే శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సిద్ధార్థ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ వెబ్సిరీస్కు సంబంధించి ఒక స్టిల్ను చిత్రబృందం విడుదల చేసింది. ఖాకీ డ్రెస్లో సీరియస్గా నడిచి వస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా స్టిల్ వెబ్సిరీస్లో ఎంత యాక్షన్ ఉండనుందో చెబుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, రోహిత్ శెట్టి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. మన దేశంలో నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీసుల ధైర్య సాహసాలను ఆధారం చేసుకుని ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నామని నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం