అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు.
వ్యవసాయాన్ని పండగ చేస్తానని పట్టించుకోని జగన్
సాగు సాగక.. ప్రభుత్వ సాయమందక
ఉరికొయ్యల పాలవుతున్న అన్నదాతలు
చిత్తూరు(వ్యవసాయం), న్యూస్టుడే: వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక, అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కుప్పకూలుతున్నాడు. ప్రభుత్వం ఆపన్నహస్తం అందిచకపోవడంతో కర్షకులు ఉరికొయ్యల పాలవుతున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో పలమనేరు, పుంగనూరు, కుప్పం, పూతలపటు,్ట, నగరి నియోజకవర్గాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 31 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అనధికారికంగా పెద్దసంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు.
ఆర్భాటానికే ఆర్బీకేలు..
రైతుభరోసా కేంద్రాలు ఆర్భాటానికే తప్ప అన్నదాతకు ఒనగూరింది శూన్యం. జిల్లాలో 502 ఆర్బీకేలు ఉన్నప్పటికీ ఆధునిక సాగు విస్తరణ సేవలు అన్నదాత దరి చేరడం లేదు. యూరియా మినహా మిగిలిన ఎరువులు ఉండవు. ఇక పురుగు మందులు, విత్తనాల విక్రయాల ఊసే లేదు.
వడ్డీ లేని రుణాలా.. తూచ్
రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకే అని నిబంధన పెట్టారు. అదీ వడ్డీతో సహా ముందే కట్టిస్తున్నారు. కొర్రీలపై కొర్రీలేసి కొందర్ని తప్పించి వడ్డీ రాయితీ ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పావలా వడ్డీ ఎత్తేశారు. ఈ-పంట నమోదు నిబంధన పేరుతో వడ్డీ రాయితీని అధిక శాతం మంది రైతులకు దూరం చేశారు.
బిందు సేద్యం చుట్టేశారు
వైకాపా ప్రభుత్వం రాగానే బిందుసేద్యానికి మంగళం పాడారు. తొలుత మూడేళ్లు పరికరాల పంపిణీ ఊసే లేకపోగా గతేడాది కొందరికి నామమాత్రంగా అందజేసి చేతులు దులుపుకొన్నారు. డ్రిప్ కంపెనీలకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
మామిడి బోర్డు ఎక్కడ?
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. 53 వేల హెక్టార్లలో మామిడి విస్తరించింది. వైకాపా ప్రభుత్వం మామిడి బీమా పథకాన్ని ఎత్తివేసి ప్రోత్సాహక పథకాలను ఆపేసింది. గత ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన మామిడి బోర్డు ఏర్పాటు హామీ కలగా మిగిలిపోయింది.
పట్టు పథకాలకు మంగళం
జగన్ పట్టు సాగు పథకాలకు మంగళం పాడారు. పట్టుగూళ్ల ప్రోత్సాహక నగదు ఇవ్వలేదు. రాయితీ వేపపిండి, క్రిమిసంహారక మందులు, యంత్ర పరికరాలు, షెడ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నగదు అందలేదని రైతులు వాపోతున్నారు.
అప్పుల భారం తీరలేదు
బైరెడ్డిపల్లె మండలం ఎర్రకదిరేపల్లెకు చెందిన రైతు హనుమంతరెడ్డి రెండెకరాల పొలంలో బోరు బావి ద్వారా పంటలు సాగు చేసేవారు. అవి చేతికందకపోవడం, బావి అడుగంటడంతో గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య సుజాత రెండు ఆవుల పెంపకంతో కుమార్తె గౌతమిని కేజీబీవీలో చదివిస్తోంది. ప్రభుత్వం నుంచి సాయమందినా అప్పులు తీర్చలేకపోయింది.
‘స్రాగు కలిసి రాక.. కుమార్తె ఆరోగ్యం సరిలేక్ఞ
బైరెడ్డిపల్లె: వ్యవసాయం కలిసి రాక రమేష్రెడ్డి ఏడాది కిందట తనువు చాలించాడు. 3 ఎకరాల్లో బోర్లు వేసి పంటల సాగుకు రూ.లక్షల్లో అప్పులు చేశారు. ఇంతలో ఏడాదిన్నర కుమార్తెకు క్యాన్సర్ అని తెలియడంతో కాపాడుకోవడానికి రూ.10 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లేక వచ్చిన ఆదాయం సాగు అప్పు కూడా తీరలేదు. చిన్నారి ఆరోగ్యం నయం కాకపోగా అప్పుల భారంతో పొలంలోనే ఉరేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ‘భర్తను కోల్పోయా. బిడ్డనూ బతికించుకోలేకపోయా. ప్రభుత్వం వితంతు పింఛను కూడా ఇవ్వలేకపోయింది’ అంటూ మూగనపల్లెకు చెందిన రమేష్రెడ్డి భార్య సావిత్రి కన్నీటి పర్యంతమైంది.
ఐదేళ్లలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు - 42
ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదైన సంఖ్య - 31
సాగు అంటేనే
భయమేస్తోంది: నాలుగెకరాల్లో మిరప సాగు చేశా. మల్చింగ్ పద్ధతిలో చేద్దామంటే రాయితీల్లేవు. పంటకు తెగుళ్లు సోకి నష్టపోయా. ఇంత జరుగుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కమలాకర్, రైతు, పేయనపల్లి, గుడిపాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
[ 05-05-2024]
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. -
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
[ 05-05-2024]
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
[ 05-05-2024]
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 05-05-2024]
ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. -
గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
[ 05-05-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. -
జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
[ 05-05-2024]
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. -
ఇదేంది జగన్.. ఇలా తిప్పుతున్నావ్..!
[ 05-05-2024]
పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. -
అండగా ఉంటాం.. ఆదరించండి
[ 05-05-2024]
ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్ చౌక్, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. -
‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’
[ 05-05-2024]
కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు వైకాపా నేతల ప్రలోభాలు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. -
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత
[ 05-05-2024]
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ