వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది.
గంగాధర నెల్లూరులోనూ ఫ్యాను పార్టీ ఓటర్లలో చీలిక
ఈనాడు, చిత్తూరు: అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. ఎక్కడ ఆ పార్టీ అభ్యర్థులు తమ ఓటు బ్యాంకుకు గండి కొడతారోననే భయం వైకాపా అభ్యర్థులకు పట్టుకుంది. పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నుంచి పోటీచేస్తున్న సునీల్కుమార్, కృపాలక్ష్మి లోలోపల మథనపడుతున్నారు. ఈసారి ఆ రెండు స్థానాల్లో వైకాపా గెలుపు కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎంత శ్రమించినా విజయం వరిస్తుందనే నమ్మకం లేదని సొంత పార్టీ క్యాడరే వాపోతుంది. షెడ్యూల్ విడుదలైనప్పుడు ఉత్సాహంగా ఉన్న వైకాపా అభ్యర్థులను నామినేషన్ల గడువు ముగిసే నాటికి నిరుత్సాహం ఆవరించింది.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవి.. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ తెదేపా అభ్యర్థిని లలితకుమారిపై 951 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్రాజాకు 1,275 ఓట్లు వచ్చాయి. 2019లో ఫ్యాను గాలి బలంగా వీయడంతో వైకాపా అభ్యర్థి ఎంఎస్బాబుకు 29,163 ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ పార్టీకి 1,254 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్బాబు ఈసారి కాంగ్రెస్ తరఫున పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్నారు. వైకాపా అధిష్ఠానం ఆయన్ను మోసం చేసిందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే కొందరు అసంతృప్తిగా ఉన్నారు. వీరు లోలోపల ఎంఎస్బాబుకు సహకరిస్తున్నందున గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓట్లు పెరగడం ఖాయం. తనను అవమానించిన జగన్కు బుద్ధి చెప్పాలని బాబు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన నామినేషన్ల ఘట్టంలో ఆయన బలప్రదర్శన చేశారు. పోలీసులు, వైకాపా నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో అధికార పార్టీలో గుబులు పట్టుకుంది. ఎంఎస్బాబు తమ ఓట్లను చీల్చి తెదేపా అభ్యర్థి మురళీమోహన్ నెత్తిన పాలు పోస్తారని వైకాపా శ్రేణులు భయపడుతున్నాయి. ప్రచారం వరకూ ఇదే దూకుడును కొనసాగిస్తే తెదేపాకు మరింత ఆధిక్యం రావడం ఖాయమని భావిస్తున్నారు.
నారాయణస్వామే లక్ష్యంగా రమేష్
గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎప్పటినుంచో కాంగ్రెస్కు కంచుకోట. 2014 ఎన్నికల నుంచి హస్తం పార్టీ క్యాడర్ వైకాపా వైపు వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఫ్యాను పార్టీనే గెలిచింది. 2019లో నారాయణస్వామి ఎమ్మెల్యేగా గెలిచి ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతి మండలంలోనూ గ్రూప్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నష్ట నివారణకు వైకాపా అధిష్ఠానం నారాయణస్వామికి బదులు ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టిక్కెట్ ఇచ్చింది. ఇది ఆయన మేనల్లుడు రమేష్కు రుచించక తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మామను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డారు. రమేష్కు గెలిచే సత్తా లేకున్నా ఎంఎస్ బాబు తరహాలో వైకాపాకు ఎంతోకొంత నష్టం చేయడానికి అవకాశం ఉంది. ఇది అంతిమంగా తెదేపా అభ్యర్థి వీఎం థామస్కు లాభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?