Merlapaka Gandhi: అద్భుతం జరగాలని ఎదురుచూసినందుకు...!
‘‘తొలి రోజు తొలి ఆటకి ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకు రావడమే మా లక్ష్యం. అందుకోసమే వైవిధ్యంగా ప్రచారం చేశాం. తొలి ఆట చూశాక ‘సినిమా బాగుంద’ంటే చాలు... కచ్చితంగా విజయం దక్కుతుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ.
‘‘తొలి రోజు తొలి ఆటకి ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకు రావడమే మా లక్ష్యం. అందుకోసమే వైవిధ్యంగా ప్రచారం చేశాం. తొలి ఆట చూశాక ‘సినిమా బాగుంది’ అంటే చాలు... కచ్చితంగా విజయం దక్కుతుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi). ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ (Like Share And Subscribe). సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘లాక్డౌన్ సమయంలో వచ్చిన ఓ ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఆ సమయంలో చాలా మంది యూ ట్యూబ్ కంటెంట్కి అలవాటుపడ్డారు. కావల్సినంత తీరిక సమయం, బయటికి వెళ్లలేని పరిస్థితి కావడంతో నేను కూడా ట్రావెల్ వీడియోలు చూశా. రకరకాల ప్రదేశాలు, వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ సమయంలోనే ఓ యూ ట్యూబర్కథ చెప్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ట్రావెల్ వ్లాగర్లు, వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు, ప్రమాదాల నేపథ్యంలో ఈ కథ సిద్ధం చేశా. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్సే. తొలి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఒక నవ్వుల ప్రయాణంలా ఉంటుంది. సంతోష్ శోభన్తో ‘ఏక్ మినీ కథ’ చేశా. ఆ తర్వాత ఈ కథ చెప్పినప్పుడు తనకి బాగా నచ్చింది. ఫరియాకి కూడా అంతే బాగా నచ్చింది. సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రలు కూడా సినిమాకి కీలకం’’.
* ‘‘కథనం ఈ సినిమాకి ప్రధానబలం. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’ సినిమాల్ని గుర్తు చేస్తూ... ప్రతి పదిహేను నిమిషాలకి కథలో ఓ మార్పు, ఓ మలుపు చోటు చేసుకుంటుంది. అది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మారేడుమిల్లి అడవుల్లో చేసిన ప్రయాణం గుర్తుండిపోతుంది. మా సినిమాకి ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూశాం. చిరంజీవి సర్ ‘వాల్తేరు వీరయ్య’ టీజర్ రూపంలో అది జరిగింది. టీజర్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే డైలాగ్ చెప్పగానే అందరూ మీ సినిమా పేరు చెప్పారంటూ మమ్మల్ని ట్యాగ్ చేశారు’’.
* ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యు.వి.క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్తోపాటు, నిర్మాత కృష్ణతో సినిమాలు చేయాలి. కొత్త కథలతోనే సినిమాలు చేస్తాను తప్ప, రీమేక్ మాత్రం చేయను. అనుభవం కోసమే ‘అంధాధున్’ రీమేక్ చేశా. ‘మీ నాన్న నవలలంటే మాకు చాలా ఇష్టం. ఆయన కథలతో సినిమాలు చెయ్యి’ అంటుంటారు చాలామంది. మా నాన్న మేర్లపాక మురళి కథతో ఓ సినిమా చేయాలని ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్