Adipurush: బుల్లితెరపై మరోసారి రామాయణం సీరియల్.. ‘ఆదిపురుష్’ ఎఫెక్టేనా..!
రామాయణం అనగానే గుర్తొచ్చేది రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్. ఇప్పుడు ఈ ధారావాహిక మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్: ‘ఆదిపురుష్’.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఇందులోని డైలాగులు, పాత్రల వేషధారణలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని సినిమా తీయాలనుకునే ముందు దాని ఆధారంగా రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్ను ఓసారి చూడాల్సిందంటూ ఎంతోమంది కామెంట్స్ చేశారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సీరియల్ ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
‘ఆదిపురుష్’ (Adipurush) విడుదల తర్వాత ఆ సినిమాలోని పాత్రలను రామాయణం సీరియల్లోని పాత్రలతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ ధారావాహికను మరోసారి టెలికాస్ట్ చేయాలని కోరుతూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో షెమారూ టీవీ ఛానల్ ఓ నిర్ణయం తీసుకుంది. జులై 3 నుంచి రామాయణం సీరియల్ను రీ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను పెట్టింది. అయితే తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్ ఈ పోస్ట్ను తొలగించింది.
రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్ అవ్వడం ఇది రెండో సారి కావడం విశేషం. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్లో ఈ సీరియల్ ప్రసారమయ్యేది. ఆ తర్వాత కొవిడ్ సమయంలో ఇది రీ టెలికాస్ట్ అయింది. 2020లో మార్చి 28 నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రసారమైంది. అప్పుడు ఏకంగా దీన్ని 7.7కోట్ల మంది వీక్షించారు. ఇక ఈ సీరియల్ ప్రేక్షకాదరణతో పాటు ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటిసారి ప్రసారమైనప్పుడే అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని లిమ్కా బుక్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకుంది. మరి ‘ఆదిపురుష్’ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.
రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో రాముడిగా అరుణ్ గోవిల్ (Arun Govil) - సీతగా దీపికా చిక్లియా నటించారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో సునీల్ లహ్రీ (Sunil Lahri) తన నటనతో అందరినీ ఆకర్షించారు. ఇక తాజాగా ఓంరౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’లో రాముడిగా ప్రభాస్ (Prabhas) సీతగా కృతిసనన్ కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాపై రామాయణం సీరియల్ నటులంతా ఆసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు.