‘యానిమల్‌’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే!

 ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.  

Published : 27 Mar 2021 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్‌’. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందులో బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 

సిద్ధార్థ్ గరిమ డైలాగ్స్ అందిస్తుండగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం, సంతాన కృష్ణన్‌ రవిచంద్రన్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌.. భూషణ్‌ కుమార్‌ నిర్మాణంలోనే రూపొందుతున్న మరో చిత్రం ‘లవ్‌ రంజన్‌’లో నటిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. రణ్‌బీర్‌ - అలియాభట్‌ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని